ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వణికిిన భూమి... ఢిల్లీ ప్రజల భయాందోళనలు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 10:43 PM

ఢిల్లీ ప్రాంతాన్ని భూకంప భయాలు వెంటాడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉందని, రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.4 అని తెలిపింది. రాత్రి 7.57 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్టు పేర్కొంది. 


దేశ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు రావడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత బుధవారం కూడా ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇదిలావుంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఓ భారీ భూకంపం వచ్చేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల హెచ్చరిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని చెబుతున్నారు.  ఇటీవల కాలంలో భారత భూ ఫలకంపై యూరేషియన్ భూ ఫలకం ఒత్తిడి స్థిరంగా కొనసాగుతోందని, ఈ సందర్భంగా జనించే శక్తి భూకంపాల రూపంలో వెలువడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa