తాజాగా ప్రధాని మోదీ ఏపీలోని విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన నెెలకొంది. విశాఖలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధాని పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వింత పరిస్థితి ఎదురైంది. ప్రధాని తన పర్యటనలో భాగంగా బీజేపీ ఏపీ కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పార్టీ నేతలు పలువురిని ప్రధాని మోదీ పేరుపెట్టి పలకరించారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వద్దకు వచ్చేసరికి 'ఆప్కా నామ్ క్యాహై' అని ప్రధాని ప్రశ్నించారు. 'సెల్ఫ్ ఇంట్రడ్యూజ్ కర్లో' (మిమ్మల్ని పరిచయం చేసుకోండి) అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ప్రధాని గుర్తించకపోవటంతో వారంతా అవాక్కయ్యారు.
ఇక.. సోము వీర్రాజు కూడా కాసేపు షాక్కు గురై తనను తాను పరిచయం చేసుకున్నారు. 'సర్.. నా పేరు సోము వీర్రాజు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని' అని బదులిచ్చినట్లు తెలిసింది. ‘రాజకీయాలు కాకుండా మీరేమి చేస్తారు?’ అని ప్రధాని అడగడంతో సోము ఒక్క క్షణం తడబడ్డారు. ‘ఏమీ లేదు సర్..’ అని సమాధానమిచ్చారు. వ్యవసాయం, వ్యాపారం ఏమీ లేవా మోదీ అని అడగ్గా... లేవని సోము చెప్పారు. రాజకీయాలు కాకుండా ఇంకా ఏం చేస్తారని ప్రధాని సోము వీర్రాజును అడిగారు. దానికి ఆయన.. తడబాటుకు గురైనా.. 'ఏమీ లేదు సర్..' అని చెప్పారు. వ్యవసాయం, వ్యాపారం ఏమీ లేవా అని మోదీ మరోసారి అడగ్గా... లేవని సోము వీర్రాజు బదులిచ్చారు.
ఆ తరువాత బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ వైపు చూసిన మోదీ ఆయన తండ్రి చలపతిరావు ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని ప్రధాని మోదీ బీజేపీ నేతలను అడగ్గా.., సోము వీర్రాజు '21' అని చెప్పినట్లు తెలిసింది. పక్కనే ఉన్న నేతలు 26 అంటూ సరి చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa