పేదరికంలో హత్య చేసని ఆపై మిలీనియర్ గా ఎదిగాక పోలీసులకు చిక్కాడు. ఓ హత్య కేసులో అనుమానితుడు ఒకటి రెండు కాదు.. ఏకంగా 29 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేయగా.. ఈ వ్యవధిలో అతడు మిలియనీర్గా ఎదగడం గమనార్హం. ఈ ఘటన సెంట్రల్ చైనా లో వెలుగులోకి వచ్చింది. చైనా మీడియా ప్రకారం.. జియాంగ్ అనే వ్యక్తి 1993లో ఒకరితో ఘర్షణకు దిగి అతడ్ని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడు చనిపోగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగించారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిందితుడి ఎక్కడ ఉన్నదీ ఎట్టకేలకు 29 ఏళ్ల తర్వాత కనిపెట్టారు. అతడు గ్యాంగ్డాంగ్ ప్రావిన్సుల్లోని హుయిజౌ నగరంలో ఉన్నట్టు గుర్తించారు. అతడు తన తల్లితో కలిసి నివసిస్తున్నట్టు తెలిసింది.
దీంతో అతడ్ని అరెస్టు చేయడానికి సెంట్రల్ చైనా హుబీ ప్రావిన్స్లోని జియాంగ్యాంగ్ నుంచి 1,200 కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించి హుయిజౌ నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం హుయిజౌలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాము వస్తున్నట్టు తెలిస్తే నిందితుడు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావించారు. కోవిడ్-19 కట్టడి సిబ్బందిగా నటించి అతడి ఇంటికి వెళ్లి చివరకు అరెస్టు చేశారు.
జియాంగ్ ఈ 30 ఏళ్లలో ఒక సాధారణ కార్మికుడి నుంచి విలాసవంతమైన ఫ్లాట్లో నివసిస్తోన్న మిలియనీర్గా ఎదిగినట్లు బీజింగ్ యూత్ డెయిలీ పత్రికి తెలిపింది. ‘మేం మిమ్మల్ని వెదుకుతూ ఎందుకు వచ్చామో మీకు తెలుసు.. ఇక నీ బకాయిలు తీర్చే సమయం దగ్గరపడింది’ అని చెబుతూ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa