ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 13, 2022, 10:56 PM

భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. శ్రీశ్రీ రవిశంకర్‌ అహింసా మార్గంలో పరివర్తనానికి కృషి చేసినందుకు గాను మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సంస్థ.. గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం ప్రకటించింది. ఎంఎల్‌కే సెంటర్ సీనియర్ ఫెలో, మార్టిన్ లూథర్ కింగ్ మేనల్లుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఫారిస్, కాన్సులర్ జెనరల్ ఆఫ్ ఇండియా స్వాతి కులకర్ణి.. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు అపూర్వ స్వాగతం పలికారు.


గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ‘‘నేను ప్రపంచ శాంతికి కట్టుబడ్డాను’’ అనే నినాదంతో చేస్తున్న ప్రపంచ యాత్రలో భాగంగా ప్రస్తుతం అమెరికా సమ్యుక్త రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ శాంతి ఉద్యమంలో ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు భాగస్వాములు అవుతూ గురుదేవ్ స్వప్నమైన హింసారహిత ప్రపంచం కోసం పనిచేస్తున్నారు.


పర్యటన తదుపరి అంకంలో గురుదేవ్ న్యూజెర్సీ, వర్జీనియా, మెంఫిస్ ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలను కలుస్తారు. అనంతరం మెంఫిస్ నగరంలో ఉండే నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియంను సందర్శిస్తారు. అమెరికా మానవ హక్కుల ఉద్యమంలో ఈ మ్యూజియానికి ప్రత్యేక స్థానం ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రఖ్యాతి గాంచిన ‘‘నాకొక స్వప్నం ఉంది (ఐ హ్యావ్ ఏ డ్రీమ్)’’ ఉపన్యాసం చేసిన 60వ వార్షికోత్సవం సందర్భంగా అదే వేదిక నుంచి వచ్చే ఏడాది గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఉపన్యాసం చేయనున్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa