మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలపరిశీలనకు ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో ఈ సబ్ స్టేషన్ ను నిర్మించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ దశలో ఉందని అన్నారు. త్వరలోనే ఈ సబ్ స్టేషన్ ను ప్రారంభిస్తామని 4 నెలల వ్యవధిలో పూర్తిచేసి ప్రజల కు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
అలానే రాజీవ్ గృహకల్ప వాసులకు నిర్ణీత సమయంలో పూర్తిస్థాయిలో త్రాగునీరు అందజేయడానికి టిడ్కో గృహసముదాయాల వద్ద నుండి రాజీవ్ గృహకల్ప వరకు నూతన పైప్ లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. 4 రోజులలో రాజీవ్ గృహకల్ప వాసులకు పూర్తిస్థాయిలో త్రాగునీరు అందించనున్నట్లు పెర్కోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa