రాజకీయ ఉద్దండిగా పేరున్నాటీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యల చుట్టే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. పత్తికొండలో నిర్వహించిన సభలో 'ఇవే నాకు చివరి ఎన్నికలు. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. లేదంటే ఇక మీ ఇష్టం' అన్నారు. అసెంబ్లీలో తనను అవమానించారని.. తన భార్యను కూడా అవమానించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్నది కౌరవ సభ.. ఆ కౌరవ సభను తాను గౌరవ సభగా మారుస్తాను అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. జనసేన పార్టీకి కలిసొస్తుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి చివరి ఎన్నికలు 2019.. చంద్రబాబు విజన్ 2020తో ముగిసింది అన్నారు. ఇక కొత్త శకం 2024 జనసేన ప్రజా పరిపాలన మొదలవుతుంది.. శుభపరిణామం అంటున్న రాష్ట్ర ప్రజలు అంటూ ట్వీట్ చేశారు. పవన్ చిత్తశుద్దికీ ఇతరుల అధికార దుర్భుద్దికి తేడా ఇది.. పదవున్నా లేకున్నా ప్రజల కోసం పోరాడతానని పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa