ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 06:06 PM

అభివృద్ధి చేతకాని వైసీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నదని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 44వ డివిజన్‌లో చంటి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాల కరపత్రాలు పంపిణీ చేశారు. చంటి మాట్లాడుతూ పట్టణాల్లో, గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా చెత్త, ఆస్తి పన్నులను వసూలు చేయడం దారుణమన్నారు. మూడున్నర ఏళ్ళలో జగన్‌ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెలిపాక వెంకన్న, డివిజన్‌ ఇన్‌చార్జి మల్లెపు రాము, శ్రీనివాసరావు, పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa