ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పులు తీర్చలేక ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 06:09 PM

ఉరవకొండ, మండల పరిధిలోని బూదగవి గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు మల్లికార్జున(62) శుక్రవారం ఉరి వేసుకున్నాడు. మల్లికార్జుకు 1.5 ఎకరాల పొలం ఉంది. దీనికితోడు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. మిర్చి, వేరుశనగ పంటలను సాగు చేశాడు. రెండేళ్ల నుంచి పంటలు సరిగా పండకపోవడంతో సేద్యం, కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో తీవ్ర మనోవేదనతో శుక్రవారం తన ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేలోగా మృతిచెందాడు. మల్లికార్జునకు బ్యాంకులో రూ.50 వేలు, బయటి వ్యక్తుల వద్ద రూ.7.5 లక్షలదాకా అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. రైతు భార్య 15 ఏళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతు కుమారుడు తిరుపతికి వెళ్లి బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే ఎస్పీ ఫక్కీరప్ప బూదగవి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa