ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ మోసాలు ఇలా కూడా జరుగుతాయి జాగ్రత్త

national |  Suryaa Desk  | Published : Sun, Nov 20, 2022, 03:10 PM

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మనం పడకపోయినా మనల్ని ఉచ్చులోకి దించడానికి స్వయంగా వాళ్లే రంగంలోకి దిగుతున్నారు.  డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. అంతా మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు చేస్తుంటే నేరగాళ్లు కూడా మోసాలు చేయడంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఫ్రాడ్స్‌ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌తో అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి మోసాలు జరగకుండా కాపాడుకోగలుగుతాం. చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయొద్దు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం గురించి తెలుసుకుందాం.


ఎలాంటి ఆర్డర్ చేయకుండానే డెలివరీ బాయ్ వేషంలో కొన్ని గూడ్స్‌తో డెలివరీ ఇచ్చేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. తానేమీ ఆర్డర్ చేయలేదని బాధితుడు చెప్పాడు. దీంతో ఆ డెలివరీ బాయ్.. ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఓటీపీ వస్తుందని నంబర్ అడిగాడు. ఆ ఓటీపీ చెప్పగానే తన బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. ఇలాంటి ఫ్రాడ్స్ నిత్యం ఎన్నో జరుగుతుంటాయి. మనం జాగ్రత్తగా ఉండకుంటే ఇక అంతే. అంతా సమర్పించుకోవాల్సిందే.


హ్యాకర్లు ఎన్నో విధాలుగా మన పర్సనల్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తస్కరించే వీలుంది. వీటిల్లో ఫిషింగ్, విషింగ్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిసింది. ఈ మేరకు సైబర్ నిపుణులు ప్రియా సంఖ్లా చెప్పారు. ఆ వైరస్ మీ ఫోన్లోకి ప్రవేశిస్తే.. అందులోని సమాచారం ట్రాన్స్‌ఫ్రర్ లేదా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫ్రాడ్స్‌కు చాలా మంది బాధితులు ఉంటారు.


కస్టమర్ సర్వీస్ ప్రతినిధులమని నిత్యం చాలా మందికి ఫోన్లు వస్తుంటాయి. వాటిల్లో కూడా కొన్ని వివరాలు అడుగుతుంటారు. పర్సనల్ విషయాలు చెబితే మోసపోయినట్లే. ఇట్టే బ్యాంకు ఖాతా ఖాళీ చేసేలా ట్రిక్స్‌తో నిండా ముంచేస్తారు.


ఇంకా ఎస్ఎంఎస్ లింక్స్, బోగస్ ఈ- మెయిల్స్ వంటివి ఫోన్‌కు పంపి.. వాటిని తెరిచే విధంగా, ఆకర్షణీయంగా మెసే‌జ్‌లు పంపిస్తారు. రివార్డ్స్, క్యాష్ బ్యాక్, రీఫండ్స్, బోనస్ పాయింట్లు, లాటరీలు వచ్చాయని ఎర వేస్తారు. అలాంటి లింక్స్ ఓపెన్ చేస్తే మనం వాళ్ల ముసుగులో చిక్కినట్లే. మన మొబైల్ లేదా ల్యాప్ టాప్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లి.. అన్ని పర్మిషన్స్ ఓకే అయిపోతాయి. అప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా వారు పసిగడతారు. మొబైల్ చోరీలు జరిగిన సమయంలోనూ అందులోని మొబైల్ డిజిటల్ యాప్స్‌కు సెక్యూరిటీ లేకుంటే.. అక్కడి నుంచి మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉంటుంది.


ఎలా రక్షించుకోవాలంటే?


నమ్మశక్యం కాని, అనుమానాస్పదంగా వచ్చిన మెసే‌జ్‌లకు రిప్లై ఇవ్వొద్దు.


ఈ- మెయిల్స్, పాప్- అప్ లేదా SMS లను జాగ్రత్తగా చదవండి. వెంటనే క్లిక్ చేసి ఓపెన్ చేయొద్దు.


క్యాష్ బ్యాక్, రీఫండ్ స్కీమ్స్ పేరుతో వచ్చే మెసే‌జ్‌లకు దూరంగా ఉండండి.


గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి. కంపెనీ లోగో, స్పెల్లింగ్ చెక్ చేస్కోండి.


CVV, OTP, PIN, అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్ వంటి వివరాలను మీ మొబైల్‌లో ఉంచుకోవద్దు. ఎక్కడా వాటిని రాసుకోవచ్చు.


UPI, బ్యాంక్ ఇతరత్రా ఏదైనా.. PIN, OTP వంటి వివరాలు అడగవు. ఇది గుర్తుంచుకోండి.


ఏదైనా యాప్స్‌కు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు.. మన అవసరాలను బట్టే చూస్కోవాలి.


అవసరం లేనప్పుడు బ్లూ టూత్ ఆఫ్ చేస్కోవాలి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa