ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత జగన్ దని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి వెల్లడించారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల పదవుల్లో భారీగా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. పలువురిని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మార్చేశారు. ఈ నాయకత్వ మార్పుపై వైవీ సుబ్బారెడ్డి మట్లాడుతూ... పదవులను మార్చినంత మాత్రాన ఆ నాయకులను తక్కువ చేసినట్టు కాదని అన్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలను మరో చోట వినియోగించుకోవాలనేది పార్టీ ఆలోచన అని చెప్పారు. పాదయాత్రలు ఎవరు చేసినా నష్టమేమీ లేదని... ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత జగన్ దని అన్నారు. ఏపీలో ప్రజల సంక్షేమ పథకాలు రాజ్యాంగ స్ఫూర్తితో అమలవుతున్నాయని చెప్పారు. టీడీపీ పాలనలో చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa