ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాబిల్లిపై చైనా అణుశక్తి ఆధారిత స్థావరం

international |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 03:11 PM

చంద్రుడిపై పరిశోధనల్లో ఉత్సాహం చూపిస్తున్న చైనా, మరో ఆరేళ్లలో అక్కడ అణు విద్యుత్‌ శక్తి ఆధారిత స్థావరాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది. చైనా లూనార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రోగ్రామ్‌ చీఫ్‌ డిజైనర్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ అణు శక్తి ఆధారిత స్థావరం ఒక మెగావాట్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుందని, దాంతో ఒక ఏడాదిపాటు వందలాది ఇండ్లకు విద్యుత్‌ను అందజేయవచ్చని SCMP తన నివేదికలో పేర్కొంది. చైనా అంచనాల ప్రకారం అణు శక్తితో వెలువడే విద్యుత్‌తో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి, చంద్రుడిపై వివిధ పరికరాలను ఆపరేట్‌ చేయవచ్చు. నీటిని వెలికితీయవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa