ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరి ప్రజలు నన్ను విశ్వసిస్తున్నారు: మంత్రి ఆర్.కె.రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 09:01 PM

నగరి నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో విశ్వసిస్తున్నారని మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. టీడీపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు. పాయకరావుపేట, కొవ్వూరు ప్రజలు అనితను ఛీత్కరించుకున్నారని, ఆమెను తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. తాను గత 12 ఏళ్ల నుంచి నగరిలోనే ఉంటున్నానని, నగరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని తెలిపారు. అందుకే నగరి ప్రజలు తనను విశ్వసిస్తున్నారని రోజా అన్నారు.  


తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తుండగా ఏపీ ప్రగతిపథంలో ముందుకెళుతోందని అన్నారు. ఏపీని జగన్ తీర్చిదిద్దుతున్న విధానాన్ని చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా అచ్చెరువొందుతున్నారని రోజా వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa