నీటి కుంటలో పడి అన్నదమ్ములు మరణించిన ఘటన యద్దనపూడి మండలం తనుబొద్దివారిపాలెంలో విషాదం నింపింది. ఆ గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డి, శిరీష దంపతులు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఆదివారం కొనుగోలు నిమిత్తం ఒక వ్యవసాయ భూమిని చూసేందుకు మస్తాన్ రెడ్డి తన ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి(8) మనోజ్ రెడ్డి(6)లను వెంటబెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామానికి వెళ్ళాడు.
మస్తాన్ రెడ్డి స్థలాన్ని చూసుకుంటుండగా ఆయన కుమారులు ఇద్దరు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న నీటి కుంటలో పడిపోయారు. దీన్ని గమనించి కుంటలో నుండి వారిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మనోజ్ రెడ్డి, మంగళవారం పవన్ రెడ్డి మరణించారు.
మనోజ్ రెడ్డి మృదేహాన్ని తనుబుద్ధివారిపాలెం తీసుకొచ్చి అంత్యక్రియలు మంగళవారం పూర్తి చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక పవన్ రెడ్డి మృతదేహాన్ని కూడా ఇక్కడికే తీసుకురానున్నారు. ఒకే సమయంలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు ఇంకా షాక్ లోనే ఉండగా తనుబొద్దివారి పాలెం గ్రామస్తులు కూడా శోకతప్తులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa