మౌనంగా ఉంటే లాభం లేదని.. ప్రజలకి ప్రభుత్వ వైఫల్యాలని తెలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. సైకో పాలన అంతం కావాలన్నారు. పాలన సీఎం జగన్ వల్ల కాని పని అని స్పష్టం చేశారు. టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని ఆయన బుధవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ప్రారంభించారు. జంగాలపేట యాదవుల బజార్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా ప్రశ్నలతో కూడిన ఫారంను పూరించారు. గ్రామంలో ఐదు ఇళ్లకు తానే నడచివెళ్లి ఫారాలు నింపించారు. అనంతరం ప్రధాన కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రోడ్షో నిర్వహించాక.. ధర్మాజీగూడెం, లింగపాలెం, చింతలపూడిలో పర్యటించారు. చింతలపూడి బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa