ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 02:10 PM

మాదకద్రవ్యాలను అరికట్టడానికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తగ్గడం లేదు. తాజాగా త్రిపురలో భారీగా మాదకద్రవ్యాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. త్రిపురలోని ధలై జిల్లా ముంగియాకామి పోలీసు స్టేషన్ పరిధిలోని ముంగియాకామి వద్ద వాహనంతో పాటు లాలన్ రాయ్ అనే వ్యక్తిని 21 సెక్టార్ అస్సాం రైఫిల్స్‌కు చెందిన రాధానగర్ బెటాలియన్ పట్టుకుంది. ఇతని వద్ద నుండి 386 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 1.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa