వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కడప జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో ఉన్న లోపాలను ప్రజలకు వివరించాలన్నారు. సమిష్టి కృషిగా తెలియజేసిన పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, టిటిడి మాజీ చైర్మన్ సుధాకర్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa