ఏపీఎస్ ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ గదల బంగారమ్మకి వినతిపత్రం అందించారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ ఉద్యోగుల సంఘంల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వర రావు తమ సమస్యలు పరిష్కరించాలని చైర్ పర్సన్ బంగారమ్మకి శనివారం వినతిపత్రం అందించారు. ఈనెల 15న నిర్వహించనున్న ఆర్టీసీ బోర్డు సమావేశంలో తమ సమస్యలను ప్రస్తావించాలని కోరారు. దీనికి స్పందించిన చైర్ పర్సన్ సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa