ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక వ్యక్తికి రూ. 1,000, కుటుంబానికి గరిష్టంగా రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం...ప్రకటించిన ఏపీ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 08:35 PM

తుఫాను వల్ల తీవ్ర కష్టాల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు మాండూస్‌ తుఫాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తికి రూ. 1,000, కుటుంబానికి గరిష్టంగా రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.


పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఈ ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లోని బాధితులకు ఈ ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది.


ఇదిాలావుంటే మాండూస్‌ తుఫాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండ­పో­త వర్షం కురుస్తుండగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీగా వర్షం పడుతోంది. తుఫాను ప్రభావంతో మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతు­న్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్ట­ణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున ప్రవ­హి­స్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి­పడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతు­న్నాయి. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం అందించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa