ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమర్షియల్ వెహికల్స్ ధరలు పెంచనున్న 'టాటా మోటార్స్'

business |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 08:01 PM

ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వాణిజ్య వాహనాల ధరలను జనవరి 2023 నుంచి 2 శాతం వరకు పెంచనున్నట్లు మంగళవారం తెలిపింది. మోడల్, వేరియంట్ ప్రకారం ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. ధరల పెంపు అన్ని కమర్షియల్ వెహికల్స్‌కు వర్తిస్తుందని తెలిపింది. వాహనాల ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్టీల్, అల్యూమినియం ధరలు ఈ సంవత్సరం పెరిగాయి. దీంతో ట్రక్కులు, బస్సుల నిర్మాణ ఖర్చులు ఇప్పటి వరకు ఎక్కువగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa