గడపగడపకు కార్యక్రమలో వైసీపీ నేతలకు అక్కడక్కడా ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏలూరులో పర్యటించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి నిరసన సెగ తగిలింది. ఆళ్లనాని గో బ్యాక్ అంటూ కొంతమంది మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆళ్లనాని 25వ డివిజన్లో పర్యటించారు. ఒక్కొక్క ఇంటికి వెళ్తూ జగన్ సర్కారు చేసిన సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు ఆళ్లనాని. అయితే.. ఇదే సమయంలో కొంతమంది మహిళలు ప్లకార్డులు చేతబట్టుకుని ఆందోళనకు దిగారు. జగనన్న ఇళ్ల కేటాయింపే నిరసనకు కారణమైంది.
25వ డివిజన్ పరిధిలో ఉండే తమకు ఎక్కడో దూరంగా ఇళ్లు కేటాయించారని.. అదే సమయంలో స్థానికేతరులకు ఇక్కడ కేటాయించారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తమ డివిజన్ పరిధిలోనే ఇళ్లు కేటాయించేలా చూడాలని మహిళలు డిమాండ్ చేశారు. ఆళ్ల నాని గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన పలువురిని.. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే ఆళ్లనాని సైతం మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంఆర్వోతో మాట్లాడి పరిష్కారం వెతుకుతామని అన్నారు. అవకాశం ఉంటే తప్పకుండా చూద్దామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa