ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి విడదల రజినిని అభినందించిన సీఎం వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 09:17 PM

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి విడదల రజినిని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభినందించారు.  ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ స్థాయి అవార్డులు వస్తున్నాయి. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. ఈనెల 10న వారణాసిలో సార్వత్రిక ఆరోగ్య భద్రత దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సెమినార్‌లో.. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను మంత్రి రజినీ.. ప్రముఖులకు వివరించారు. అటు.. రాష్ట్రానికి రెండు అవార్డులు కూడా దక్కాయి. వాటిని మంత్రి రజిని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్వీకరించారు.


మంగళవారం రోజున ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి విడదల రజిని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎం జగన్‌ను కలిశారు. వారణాసిలో ఏపీకి దక్కిన అవార్డులను ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రి విడదల రజిని, వైద్యారోగ్య శాఖ అధికారులను అభినందించారు. టెలీ కన్సల్టేషన్‌ విభాగం, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ల విభాగంలో కేంద్రం నుంచి రెండు ఏపీకి అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో పనిచేయాలని సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa