ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 04:35 PM

మాండోస్ తుఫాన్ ప్రభావంతో దర్శి నియోజకవర్గంలో రైతులకు చేతికందిన పంట నీళ్ల పాలైందని దర్శి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు అన్నారు. రైతులకు వెంటనే పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన బుధవారం నాడు పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని పాపారావు విమర్శించారు. రైతులను తక్షణమే ఆదుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa