రాజాం పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద భారీ సంఖ్యలో వాలంటరీలు గురువారం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాలంటరీ వ్యవస్థపై తప్పుడు కథనాలు, రాతలు, వాస్తవాలు ప్రచురించకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ఈనాడు పత్రిక చేసే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ పై తప్పుడు రాతలు బావ్యం కాదన్నారు. ప్రతి నెల ఒకటో తారీఖు వృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచంద సేవ చేస్తున్న వారిపై ఈ రాతలు విచారకరమన్నారు. ఇతర పార్టీ నాయకుల ఇళ్ళకు సైతం వాలంటీర్ నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వెతికి చేస్తున్న సీఎం జగన్ పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ జవాబుదారీతనం తెచ్చిందన్నారు. వాలంటీర్లు పైన తప్పుడు కథనాల రాసిన ఈనాడు యజమాని రామోజీరావు వాలంటీర్లు అందరికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం మండల వాలంటీర్ అధ్యక్షుడు పెదలెంక పురుషోత్తం నాయుడు, రాజాం మండల వాలంటీర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa