ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 1,673 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 3 వేలకు పైనే ఉందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం పూర్తయిందని నాదెండ్ల పేర్కొన్నారు. రైతులు క్రాప్ హాలిడే కాకుండా, వైసీపీ ప్రభుత్వానికి హాలిడే ప్రకటించాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa