పార్టీ నేత కుటుంభానికి వైసీపీ అధినేత, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారావు మృతిపై.. ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సుబ్బారావు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన ఎడవల్లి సుబ్బారావు (62) మంగళవారం మృతిచెందారు.
ఈ నెల 7న విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు సుబ్బారావు హాజరయ్యారు. సభలో సుబ్బారావు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను పార్టీ నాయకులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి.. వైద్యం అందించారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సుబ్బారావు మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి.. సుబ్బారావు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి.. పార్టీ తరఫున రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మృతుడి గ్రామానికి వెళ్లి స్వయంగా అందజేయనున్నట్లు మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్ చెప్పారు. బీసీల పట్ల సీఎం జగన్కు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa