వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగలనుంది. జనసేన పార్టీలోకి భారీగా వైసీపీ నుంచి చేరికలు జరగనున్నాయి. జనసేనలో చేరేందుకు రాజోలు నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఇప్పటికే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. రాజోలు వైసీపీ సీనియర్ నేత బొంతు రాజేశ్వర రావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో పిఅర్ అండ్ అర్డి రూరల్ వాటర్ సప్లైకు సలహాదారుగా పని చేశారు. ఆదివారం రాజేశ్వరరావు ఆయన అనుచరులు జనసేనలో చేరారు. అలాగే విజయనగరంకు చెందిన వైసీపీ నేత గురాన అయ్యలు, పి.గన్నవరం వైసీపీ ముఖ్య నేత కొప్పుల కొండలరావు తదితరులు కూడా ఇవాళ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa