ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 23 నుంచి 25 వరకు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం జగన్ రేపు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కడప అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు. 24న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa