ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 01:17 PM

స్మార్ట్‌ మీటర్లపై ప్రముఖ పత్రిక అసత్య ప్రచారం చేస్తోందని, కుట్రపూరితంగా రాతలు రాస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్మార్ట్‌ మీటర్లపై ఎల్లోమీడియా దుష్ప్రచారాం చేస్తుందని  మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. మామూలు మీటర్ల కంటే రెండు రెట్లు ఎక్కువ‌గా ధర ఉందని రాసే పత్రిక యాజమాన్యం.. తక్కువ రేటుకు ఇప్పించేందుకు టెండర్‌లో పాల్గొనవచ్చు కదా..? స్మార్ట్‌ మీటర్ల టెండర్లలో ఆ యాజమాన్యం కూడా పాల్గొనవచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. టెండర్‌లో ఎంత తగ్గితే ప్రభుత్వానికి కూడా అంత ఆదాయం మిగులుతుందన్నారు. అప్పుడు ప్రభుత్వంతో పాటు ఆ యాజమాన్యానికి కూడా మంచి పేరు వస్తుందని సలహా ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa