పశ్చిమగోదావరి జిల్లాలోని టీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం కొనసాగుతోంది. నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని... వైసీపీ పాలనలో జగన్ రెడ్డి అసమర్థతతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. టీడీపీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కాటేపల్లి సత్యనారయణ, క్లస్టర్ ఇంచార్జి, రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామ్మూర్తి, రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటిసి నల్లూరి వెంకటచలపతిరావు, యూనిట్ ఇంచార్జి, తెలుగుయువత నియోజకవర్గం అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, మాజీ సొసైటీ అధ్యక్షులు ఆచంట సూర్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ఆచంట అనిల్, బూత్ కన్వీనర్లు తాళ్ళ దుర్గారావు, మెతుకుమిల్లి నాగేంద్ర కుమార్, బిసి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి రవి, సాధనాల బూసిబాబు, దవులూరి కృష్ణమోహన్, గౌర్ని ప్రాసాద్, పాతూరి రామకృష్ణ, తమ్మిన సుబ్రహ్మణ్యం, కలపాల మూర్తి, కొప్పర్తి గోపి, రాయపాటి పవన్, బిసి సాధికారిక కమిటీ సభ్యులు షేక్ సుభానీ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa