ప్రాథమిక విద్య మాతృబాషలో ఉండి తీరాలని.. ఇది తప్పని సరి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం, విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రారంభమైన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆయన మాట్లాడుతూ పరిపాలన భాష మాతృ భాషలో ఉండాలని, న్యాయవ్యవస్థలో తీర్పులు తెలుగులో ఉండాలన్నారు. ఉన్నత సాంకేతిక విద్యను మాతృబాషలోకి తేవాలని, ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాతృబాషలో మట్లాడాలని సూచించారు. ఇతర దేశాల వారు మన భాషా గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఉన్నాయని, ఇవి రాక ముందు ప్రజల్లో ఆలోచనలు పెంచేవి రచనలని పేర్కొన్నారు. శ్వాస, భాష రెండు మనకు ఎంతో ముఖ్యమని, శ్వాస, భాష రెండు అగకూడదన్నారు. భాష కళ్ళు లాంటిదని.. ఇంగ్లీష్ కళ్లద్దాల లాంటిదని.. కళ్ళు ఉంటేనే కళ్లద్దాలు ఉపయోగపడతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa