ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ఉపాధ్యా యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 02:22 PM

ముఖ్యమంత్రి జగన్‌ అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే చిరంజీవి రెడ్డి విమర్శించారు. గురువారం పొదిలి బీజేపీ కార్యాలయంలో  మండల పార్టీ అధ్యక్షుడు మాకినేని అమరసింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తలు, మీడియా సమావేశంలో ఆయన పొల్గొని మాట్లాడారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపునకు కార్య కర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మోడీ ఆదేశాల మేరకు 2024లో ఏపీ, తెలంగాణలో గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. పెంచిన జీతాలను తగ్గించి చెల్లిస్తున్న నాయకడు ఉన్నారాంటే అది జగననే చె ప్పాలన్నారు. ఉపాధ్యా యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ది వాలా తీసిందన్నారు. ఎన్నికలకు ముందు మాటతప్పను మడమతిప్పను అంటూ వచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట, మడమతిప్పారన్నారు. 50 వేల కోట్లు రోడ్ల అభివృద్ధికి నిధులిస్తే ఆంధ్రలో రోడ్లపై వరినాట్లు వేసు కోవచ్చన్నారు. లక్ష మంది పీజీ విద్యార్థుల పొట్టగొట్టారన్నారు. పీహెచ్‌డీ చదివిస్తానని చెప్పిన జగన్‌ డిగ్రీతో ముగించి అన్యాయం చేశారన్నా రు. మద్య నిషేధం పేరుతో సొంత బ్రాండ్లతో పేదలను దోచుకుంటున్నారన్నారు. పరిశ్ర మలు, విద్య, వ్యవసాయ అభివృద్ధిని నీరుగార్చారన్నారు. బీజేపే తోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చిరంజీవిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa