ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ను పునఃప్రారంభించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 06:40 PM

ధర్మవరం ఎన్ జీవో హోమ్ నందు టైల్స్& గ్రానైట్ కార్మికుల సమావేశం సుబహాన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన సాంబశివ, సిఐటియు పట్టణ ప్రధానకార్యదర్శి. ఆయూబ్ ఖాన్, అధ్యక్షుడు ఆదినారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం. సంక్షేమ బోర్డు ను పూర్తిగా రద్దు చేసే ఆలోచన లో వుంది అని దానిలో బాగంగానే బోర్డు నుండి నిర్మాణ కార్మికుల కు ఎటువంటి క్లైములకు గాని, పథకాలకు నగదు చెల్లింపులు చేయరాదని ఉత్తర్వులు జారీచేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతంగా నిర్మాణ ముడి సరుకుల ధరలు రాష్ట్రంలో వున్నాయని తద్వారా సామాన్య ప్రజలు సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఇసుక వ్యాపారం లో అధికార పార్టీ నాయకులు మునుగు తేలుతున్నారనీ సామాన్య ప్రజలు ఇసుక ను ముట్టుకుంటే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతోదంన్నారు ఈ ప్రభుత్వం. కార్మికులందరూ ఐక్యమై ఈ దుర్మార్గపు ఆలోచన లతో వున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం(సిఐటియు)అనుబంధం చేపట్టే కార్యక్రమాల లో పాల్గొనాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa