పింఛను, రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ వేలూరు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పులివెందుల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. పింఛను, రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం సమయాత్తమావుతోందన్నారు. ఈ నేపథ్యంలో నోటీసులను కూడా జారీ చేసిందని, 15 రోజుల లోపల సంజాయిషీ ఇవ్వని పక్షంలో పెన్షన్, రేషన్ కార్డులను శాశ్వతంగా తొలగిస్తామంటూ ఆ నోటీసులో హెచ్చరికలు జారీ చేసినారన్నారు. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో వేల సంఖ్యలో పింఛన్ వినియోగదారులు తమ కార్డులను, పింఛన్ సొమ్ము కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. 300 యూనిట్ల కరెంటు బిల్లు వచ్చినా అలాగే 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్న ఇల్లు, 10 ఎకరాలపైబడి భూమి కలిగిన వారందరికీ పింఛను రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు.
నిబంధనల పేరిట వినియోగదారుల నుంచి పింఛన్, రేషన్ కార్డును ఒక్కసారిగా తొలగిస్తామని నోటీసులు జారిచేయడంతో వారందరూ ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిబంధనల పేరిట ఎప్పుడూ తొలగింపు చేపట్టలేదని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక, అసమర్థ విధానాల వల్ల ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది అన్నారు. వీటికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అన్న చందంగా రేషన్, పింఛన్లను తొలగించడం మరింత వ్యతిరేకత దారితీస్తోందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పింఛన్, రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని, యధావిధిగా వానికి వారికి పింఛన్ సొమ్ము అందజేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున సూచిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa