ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాసమస్యలపై జనసేన, బీజేపీ కలిసి పోరాటం చేస్తాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 07:37 PM

జనసేన, బీజేపీ  కలిసే ఉన్నాయని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ప్రజాసమస్యలపై జనసేన, బీజేపీ కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు. దేశం డిజిటల్ ఇండియాగా మారుతోందని, ఏపీలో లిక్కర్‌ పాపుల్లో మాత్రం డిజిటల్‌ చెల్లింపులు జరగట్లేదని తప్పుబట్టారు. కేంద్ర పథకాలకు ఏపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుంటోందని, ఏపీలో రాజకీయం దిగజారిపోయిందని జీవీఎల్‌ విమర్శించారు.దేశం గర్వించదగ్గ రాజకీయ నేత మాజీ ప్రధాని వాజ్‌పేయి అని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. వాజ్‌పేయి ఎప్పుడూ రాజకీయాన్ని వ్యక్తిగత కక్షలకు వాడుకోలేదని గుర్తుచేశారు. ఏపీలో డబ్బు రాజకీయాలు జరుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. ఏపీలో ఖాళీ స్థలాలను ప్రభుత్వం ఆక్రమిస్తోందని సోమువీర్రాజు ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa