వైకాపా ప్రభుత్వం వివిధ కారణాల చూపి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, వికలాంగుల పింఛన్లను తొలగించడం దుర్మార్గమని సిపిఎం పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు మండిపడ్డారు. సమాజిక పింఛన్లను తొలగించరాదని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు సోమవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు మాట్లాడు తూ పట్టణంలో సుమారుగా 1100 పింఛన్లు తొలగించడానికి మున్సిపల్ అధికారులు దస్త్రాలు తయారు చేయడం దుర్మార్గం అన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన 30% పేద ప్రజలకు 300కు పైగా యూనిట్లు వచ్చాయన్నారు. అదే విధంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో 60 శాతం మంది పేదలకు వెయ్యి గజాలకు పైగా స్థలం ఉన్నట్టు చూపిస్తూ, వికలాంగులకు పర్సంటేజ్ తక్కువ ఉందని, వృద్ధు లకు ఆధార్ కార్డు సరిగా లేదని ఇలా వివిధ కారణాలతో పేదలకు ఇస్తున్న పింఛన్లు తొలగించాలని చూస్తున్నారన్నారు.
ఇప్పటికైనా విద్యుత్, మున్సిపల్ అధికారులు చేసిన తప్పిదాలను గుర్తించి తొలగించిన పింఛన్లను యధావిధిగా కొనసాగించాలని, అదే విధంగా అర్హులైన పేదలందరికీ కొత్త పిక్చన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేద ప్రజలందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్. భవానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యవర్గ సభ్యులు మారుతి ప్రసాద్, సాకే నాగరాజు, కసాపురం రమేష్, రంగమ్మ, పట్టణ కమిటీ సభ్యులు తిమ్మప్ప రాము నాయక్, ఓబులేసు, షబ్బీర్, అబ్దుల్లా, చరన్, సుబ్బయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకీ, కిషోర్, కెవిపిఎస్ నాయకులు వీరన్న, వీరస్వామి, రామయ్య, ఆవాజ్ కమిటీ నాయకులు మస్తాన్ మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa