ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 08:03 PM

కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌ చంద్రబాబు ప్రచార ఆర్భాటంతో ఇరుకు సందులో ఏర్పాటు చేసిన రోడ్డుషోతో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో 8 మంది టీడీపీ సానుభూతిప‌రులు మృతిచెందారు. ఆ  కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం తరఫున సాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa