మరో మూడు నెలల్లో విశాఖపట్నం రాజధాని అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజలు బయపడాల్సిన పని లేదని విశాఖను రాజధాని చేసి తీరుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని రద్దు చేసి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖను కార్యనిర్వహక రాజధానిగా, అమరావతిని శానస రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ ప్రకటనపై అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత రెండేళ్లకుపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. పాదయాత్రలు, నిరసనలు న్యాయ పోరాటాలకు పిలపునిచ్చారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయు.
ఈ నేపథ్యంలో రాజధాని విశాఖపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన.. మరో మూడు నెలల్లో విశాఖపట్నం రాజధాని అవుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు బయపడాల్సిన పని లేదని విశాఖను రాజధాని చేసి తీరుతామని చెప్పారు. టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని రాజధానిగా ప్రకటించిందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని అన్నారు.ఈ ఏడాది సీఎం జగన్ మరింత మంచి పాలన అందిస్తారని మంత్రి బొత్స వ్యాఖ్యనించారు.
ఇదిలా ఉండగా.. రెండ్రోజుల క్రితం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని.. లేని పక్షంలో ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగానైనా ప్రకటించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్ను అభివృద్ధి చేశాక.. విభజనతో విడిచిపెట్టి వచ్చాం అన్నారు. ఆ పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు ఈ ప్రాంతం వెనుకబాటుతోనే ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతి రియల్ఎస్టేట్ వ్యాపారుల నగరమని మంత్రి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa