ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఐటీకి సంబంధించిన పాలసీ తప్ప.. వాస్తవానికి పని జరగడం లేదని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు విమర్శించారు. రాష్ట్రంలో ఐటీ వృద్ధి కోసం శాటిలైట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రభుత్వం సహకరించి, అభివృద్ధి చేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం జగన్కు ఎంపీ జీవీఎల్ నరసింహారావు బహిరంగ లేఖ రాశారు.
స్టార్ట్అప్స్ కోసం సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. అలాగే, ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన రూ. 90 కోట్ల బకాయిలను చెల్లించాలనన్నారు. ఈ ఏడాది ఐటీ అభివృద్ధిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కోరారు.
ఇక, ప్రభుత్వ పాలనలోని లోపాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తామని ఎంపీ రఘురామ వెల్లడించారు. ఓటు బ్యాంకు నిర్మాణంపై ధ్యాసపెట్టిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. 2023లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ జీవీఎల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ రంగం ప్రధాన ఆస్తి అని, దాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పుడు కూడా హైదరాబాద్తో ముడిపడి ఉన్నారని.. ఐటీ రంగంలో ఏపీని అభివృద్ధి చేయడంలో పూర్తిగా ఆసక్తి చూపడం లేదని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa