బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేయడానికే తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ వస్తోందన్నారు. కేసీఆర్కి అనేక ప్రశ్నలు వేస్తున్నామని... వాటికి సమాధానం చెప్పిన తర్వాతే ఏపీకి రావాలన్నారు. ఆంధ్ర వాళ్ళులను కేసీఆర్ కుక్కలు అన్నారా? లేదా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్ళని తరిమి తరిమి కొడతానని కేసీఆర్ అన్నారా? లేదా? అని నిలదీశారు. ఇంకా జీవీఎల్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్ర పాలకులు మనకు అవసరమా అని కేసీఆర్ అన్నారు. సేమ్ ఫీలింగ్.. కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి. ఏపీకి నీళ్లు, నిధులు, ప్రాజెక్టులు అన్ని కేసీఆర్ అడ్డుకుంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని కేసీఆర్ లెటర్ రాశారు. పోలవరంపై కేసులు వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర, రాయలసీమను ఎడారి చేయాలని కేసీఆర్ చూశారు. రాజధాని లేకుండా కేసీఆర్ చేశారు. కేసీఆర్ని ప్రశ్నించే దమ్ము జగన్, బాబుకు లేదు. మీ రౌడీ రాజకీయాలకు.. భయపడి తెలంగాణలో ఆంధ్రులు గతంలో ఓటు వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేరు మార్చుకుని మేక వన్నె పులి కేసీఆర్ ఏపీకి వస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టాలి. ఏదో సాకు చెప్పి పాదయాత్ర, సభలపై ఆంక్షలు పెట్టడం సరికాదు. ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని జగన్ చూస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa