2022 సంవత్సరంలో జిల్లా ఎస్. పి కే. కే. ఎన్ అన్బురాజన్ పర్యవేక్షణలో పోలీసులు సైబర్ నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టేలా ఉక్కు పాదం మోపారు. గురువారం కడప జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. పలువురు అంతర్ రాష్ట్ర మోసగాళ్లను అరెస్టు చేసి రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకతను చాటి చెప్పారు. బీమా పేరిట కరోనాతో మరణించిన వారికి ప్రభుత్వం నుండి ఆర్ధిక లబ్ది అందచేస్తామంటూ ప్రజలను మాయమాటలతో ఏమార్చి రూ. లక్షలు కొల్లగొట్టిన సైబర్ మోసగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు.
లోన్ యాప్ మోసాలకు సంబంధించి రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మోసగాళ్లను 14 మందితో పాటు వారికి సహకరించిన మరో 8 మంది స్థానికులను అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని రూ. 79, 13, 38, 133 నగదును గుర్తించి ఫ్రీజ్ చేసి తదుపరి చర్యలకై ఈ డికి సిఫారసు చేశారు.
లోన్ యాప్ , ఇన్వెస్ట్మెంట్ యాప్, బీమా, లాటరీ పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తున్న పలువురు సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేసి రూ. 19, 03, 196 స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది 2022 సం. లో ఐ. టి చట్టం క్రింద 81 కేసులు నమోదు చేసి 58 కేసులను చేధించారు. 23 దర్యాప్తు తుదిదశలో ఉన్నాయి. ఎన్ సి ఆర్ పి పోర్టల్ ద్వారా 1554 ఫిర్యాదులు రాగా 1400 ఫిర్యాదులు పరిష్కరించగా, 154 దర్యాప్తు లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa