ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరామర్శలతో ప్రజలను మోసం చేస్తున్నారు,,, అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 04:28 PM

గతంలో పవన్ కల్యాణ్ ఉన్న హోటల్ కు చంద్రబాబు వెళ్లి పరామర్శించారని, ఇవాళ చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించారని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఇద్దరూ పరస్పరం పరామర్శించుకుంటున్నారని, ఈ పరామర్శలతో ప్రజలను మోసం చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించడాన్ని మీడియాలో ఈ ఉదయం నుంచి ఒక ఆశ్చర్యకర పరిణామంగా చూస్తున్నారని, కానీ తనకు ఇందులో ఎలాంటి ఆశ్చర్యకర అంశం కనిపించడంలేదని అన్నారు. ఇదేమీ కీలకమైన భేటీగా భావించడంలేదని పేర్కొన్నారు. తనకే కాదని, వైసీపీకి, కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా ఇదేమీ అత్యంత ముఖ్యమైన పరిణామం అనిపించడంలేదని వివరించారు. 


టీడీపీ, జనసేన రెండు వేర్వేరు పార్టీలు అనుకున్నప్పుడే ఇది కీలక భేటీ అవుతుందని, కానీ చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పుట్టినప్పుడు ఇది కీలక పరిణామం ఎలా అవుతుందని అంబటి వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబును రక్షించడానికి ఏర్పడిన బి టీమ్ జనసేన పార్టీ అని, పవన్ ఎప్పటికప్పుడు ప్యాకేజి తీసుకుంటూ చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా కాపాడేందుకు ఏర్పడిన పార్టీ అని తెలిసిన వాళ్లకు వీరిద్దరి భేటీ ఆశ్చర్యకర పరిణామం కాదని ఎద్దేవా చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa