ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బుధవారం
పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆమదాలవలస పట్టణంలోని మోనింగ్ వారి వీధి లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు మురళి, సాయి పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే లక్ష్మీ నగర్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం లో ఉన్న అయ్యప్ప స్వామికి ఆలయ అర్చకులు మృత్యుంజయ శాస్త్రి పూజలు నిర్వ హించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలతో పాటు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు పాల్గొన్నా రు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa