విజయవాడ ,సత్యనారాయణపురం శ్రీ శారదాంబ మహిళా సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఈనెల 22న ప్రశాంతి మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి వైవీ కోటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అథారిటీ ఉత్తర్వుల మేరకు బుధవారం ఫారం ఒకటి ఎన్నికల నోటీసును ఆయన విడుదల చేశారు. ఈనెల 13న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్హులైన బ్యాంకు సభ్యుల నుంచి నామినేషన్లను బ్యాంకు కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. స్వీకరించిన నామినేషన్లు 14న పరిశీలిస్తారని తెలిపారు. 15న సాయంత్రం 5గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అనుమతి ఇస్తామన్నారు. పోటీ ఉంటే 22న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఓటింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, అనంతరం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని కోటేశ్వరరావు తెలిపారు. 15న నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీ లేకపోతే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అర్హులైన ఓటర్ల జాబితాను బ్యాంకు నోటీసు బోర్డులో ఉంచామన్నారు. మరింత సమాచారానికి తనను కానీ, బ్యాంకు సీఈవోను కానీ బ్యాంకు పనివేళల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa