గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 26 రిపబ్లిక్ డే రోజున రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని ఆంధప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపునిచ్చింది. విజయవాడ, గాంధీనగర్ ప్రెస్క్లబ్లో బుధవారం ప్రెస్మీట్లో సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి నేటి వరకు కార్పొరేట్ సంస్థలకు రూ.10 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని మండిపడ్డారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తెస్తా మన్న హామీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఢిల్లీ రైతుల ఉద్య మంలో మృతి చెందిన 750 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వా లని, రైతులపై పెట్టిన 80 వేల కేసులను ఉపసంహరించుకోవాలని, సింఘ బోర్డర్లో రైతు ఉద్యమానికి గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ప్రధానకార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, సాగునీటి విని యోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, రైతు సంఘం నాయకులు కేశవరావు, కొల్ల రాజమోహన్, జమలయ్య, ప్రసాద్బాబు, ప్రభాకరరెడ్డి, మర్రెడ్డి వెంకటరెడ్డి, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa