మెట్రో స్టేషన్ల వద్ద వ్యక్తలకు భద్రతలేకుండా పోతోంది. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని నగవర ప్రాంతంలో మంగళవారం (జనవరి 10) ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన తేజస్విని, లోహిత్ దంపతులు తమ చిన్నారులతో కలిసి బైక్పై వెళ్తుండగా.. కళ్యాణ్ నగర్, హెఆర్బీఆర్ మార్గంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అకస్మాత్తుగా కూలి వారి బైక్పై పడింది. మెట్రో పిల్లర్ శిథిలాలు నేరుగా బైక్ వెనకాల కూర్చున్న తేజస్విని, ఆమె చేతిలో ఉన్న రెండున్నరేళ్ల వారి కుమారుడు విహాన్పై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన తేజస్విని భర్త లోహిత్, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
మెట్రో పిల్లర్ నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని లోహిత్ తండ్రి విజయకుమార్ అన్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది. ఇటీవల మహారాష్ట్రలోనూ ఇదే తరహా విషాదం చోటు చేసుకుంది. థాణేలోని ఓ మాల్ సమీపంలో మెట్రో పిల్లర్కు అమర్చిన ఐరన్ రాడ్ విరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa