వేంపల్లె మండలం ముత్తకూరు గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కలియతిరిగారు. గ్రామంలో మంజూరైన సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో వివిధ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో వాలంటీరు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ నాంది పలికారన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఆర్థిక అసమానతలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాల గురించి తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. వాలంటీర్లు , సచివాలయ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడంతో ఆశించిన ఫలితాలు దక్కాయన్నారు. భవిష్యత్ మరింత అభివృద్ధి చేపట్టేందుకు ముందుకు వెళ్తామని ఆయన స్పష్టంచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa