ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడుతా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 04:13 PM

టీడీపీ ముఖ్యనేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమావేశం నిర్వహించారు. అనుబంధ సంఘాల నేతలతో లోకేశ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే యువగళం యాత్ర చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడుతానన్నారు. సైకో ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ వచ్చాక తామే పరిష్కరిస్తామని లోకేశ్ తెలిపారు. ‘‘రాష్ట్ర చరిత్రలో మూడున్నరేళ్లుగా సైకో పాలన చూస్తున్నాం. సమస్యలపై పోరాడుతున్న టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నా టీడీపీ నేతలు, కార్యకర్తలు తగ్గడం లేదు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఎన్నో మంచి పనులు చేయవచ్చు’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa