తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జి బోడె ప్రసాద్ అన్నారు. గోసాల గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు పోతురాజు రమేష్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యురాలు చిన్నారి పోతురాజు దీపికకు తానా సమ కూర్చిన రూ.50 వేలను గురువారం బోడె ప్రసాద్ అందించారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూల్చడం తప్ప ప్రజ లకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. ఆర్థిక సాయాన్ని సమకూర్చిన తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ, సమన్వయకర్త మల్లినేని ఠాగూర్ను బోడె ప్రసాద్ అభినందించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, కోనేరు రామలింగేశ్వరరావు, కోనేరు సాంబశివరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, షేక్ మాబు సుబాని, సంగెపు రంగారావు, చోడవరపు సుజాత, ఎందువ రాంబాబు, కోనేరు కోటేశ్వరరావు, కోనేరు వెంకటేశ్వరరావు, బిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa