ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 06:33 PM

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల క్రితం ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌ కళాహీనంగా మారడంతోపాటు మరమ్మతులకు గురయ్యాయి. పైకప్పు పెచ్చులు ఊడటంతోపాటు వర్షం కురిసిన సమయంలో నీరు దిగడం, డ్రైనేజీ పైపులు పగిలిపోవడం, దుర్గంధం వంటి సమస్యలతో క్వార్టర్స్‌ పరిస్థితి దారుణంగా మారాయి. ఈక్రమంలోనే టీటీడీ బోర్డు తిరుమలలోని ఉన్న డీటైప్‌, బీటైప్‌, సీటైప్‌, స్టాఫ్‌ క్వార్టర్స్‌లోని దాదాపు 400 గదులను మరమ్మతులు చేయాలని గత ఏడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిదశలో రూ.19కోట్ల నిధులను జారీ చేశారు. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాలకు ముందే ఇంజనీరింగ్‌-5 విభాగం దాదాపు 54 గదుల మరమ్మతులు పూర్తిచేసి అధునాతన వసతులతో తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఇకా, బీటై్‌పలోని 32 గదుల మరమ్మతు పనులు కూడా ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. వీటిని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు పనిచేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa