టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడుగు బయటకు పడితే వైసీపీకి ఏమవుతుందో అనే భయం ప్రభుత్వంలో కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా రవీంద్ర ఘాట్ వద్ద పరిటాల శ్రీరామ్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. జీవో నెంబర్ 1 అంటూ లేనిపోని షరతులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని షరతులు పెట్టినా ప్రజలు పాదయాత్రకు నీరాజనం పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. పరిటాల రవీంద్ర ఆశయ సాధన కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పరిటాల శ్రీరామ్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa